ఉగ్రవాదానికి అమెరికానే కీలకం..

జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం ఫరూఖ్‌ అబ్దుల్లా పాశ్చాత్య దేశాలపై మండిపడ్డారు.ఉగ్రవాదం పెంచి పోషించింది మీరే. ఇప్పుడు ఎందుకు అరుపులు, పెడబొబ్బలు పెడుతున్నారు? అమెరికా సహా పాశ్చాత్య దేశాలే నేటి ఉగ్రవాదానికి బాధ్యత వహించాలి. ఇప్పుడు దాడులు ఎదుర్కోవాల్సి వచ్చే సరికి మీరే గగ్గోలు పెడుతున్నారు. ముస్లింలు ఉగ్రవాదులు కాదు. అమెరికా, బ్రిటన్‌ ఉగ్రవాదాని పెంచి పోషించాయి. ఇప్పుడు వారే దాని ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. తాము సృష్టించిన వారి నుంచే ఇప్పుడు ముప్పు ఎదురైతే అరచి శోకండాలు పెడుతున్నారన్నారు.