ఇస్లామాబాద్‌లో సార్క్‌ సదస్సు..

సార్క్‌ దేశాల 19వ సదస్సుకు ఇస్లామాబాద్‌ ఆతిథ్యమివ్వనుంది. నవంబరు 9, 10వ తేదీల్లో సదస్సు జరగనున్నట్లు పాకిస్థాన్‌ శుక్రవారం ప్రకటించింది. సభ్యదేశాల నేతలను తమ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.