ఇదో అసహనయుగం..

'ప్రతి ఒక్కరూ ప్రతి అంశాన్ని భిన్నమైన రీతిలో ఆలోచిస్తున్నారు. ఇది అసహన యుగంగా మారిపోయింది' అంటూ ముంబయి హైకోర్టు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక్కడి హాజీఆలీ దర్గాలో మహిళల ప్రవేశాన్ని నిషేధించటాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్య పిటిషన్‌ను విచారణకు చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.