
ప్రజాపంపిణీ వ్యవస్థ, వంటగ్యాస్లకు మాత్రమే ఆధార్ వినియోగాన్ని పరిమితం చేస్తూ గతంలో జారీ చేసిన ఆదేశాలను సవరించడానికి విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాలన్న పిటిషన్పై శుక్రవారం సాయంత్రంలోపు నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టు గురువారం కేంద్రానికి, సెబీ, ఆర్బిఐ తదితర సంస్థలకు హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని విచారిస్తున్న సుప్రీం బెంచ్కు నేతృత్వం వహిస్తోన్న ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు మాట్లాడుతూ తనకు శుక్రవారం సాయంత్రం వరకు సమయం ఇవ్వండి. అప్పటిలోగా తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.