ఆగస్టు11న రాష్ట్ర బంద్‌..

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాపై ఆగస్టు 10వ తేదీలోగా పార్లమెంటులో స్పష్టమైన ప్రకటన రాకపోతే ఆగస్టు 11న రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు 25వ తేదీన జరిగిన ప్రజా సంఘాల సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని పేర్కొంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సోమవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకుంటుందని విభజన బిల్లులో పేర్కొన్నా ఆచరణలో అదేమీ కనిపించడం లేదని అందులో పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ప్రభుత్వం తరుపున కేంద్రానికి పంపిన నివేదికలు బుట్టదాఖలయినా మాట్లాడకపోవడం శోచనీయమని తెలిపారు. ఫ్రధానివద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని కోరినా పట్టించుకోవడం లేదని లేఖలో పేర్కొన్నారు. వెంటనే దీనిపై స్పందించి కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన కోరారు. లేనిపక్షంలో బంద్‌కు దిగుతామని హెచ్చరించారు.