అసెంబ్లీలో ‘ప్రత్యేక హోదా’ వేడి

ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన తర్వాత సభలోకి వచ్చిన వైకాపా సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. వైకాపా ఆందోళనపై స్పందించిన ఆర్థికమంత్రి యనమల ప్రత్యేక హోదా అశంపై సీఎం ప్రకటన చేస్తారని.. ఆ తర్వాత జరిగే చర్చలో పాల్గొనాలని స్పష్టం చేశారు.