అవినీతి కేసుల్లో దర్యాప్తు ఆపొద్దు

అవినీతికి సంబంధించిన కేసుల్లో దర్యాప్తును అడ్డుకోరాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పులిచ్చిందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ‘ఓటుకు కోట్లు’కేసులో హైకోర్టుకు నివేదించారు. అవినీతి కేసులో దర్యాప్తునకు ఆదేశించే అధికారం ఏసీబీ ప్రత్యేక కోర్టుకు ఉందని, దాని అధికారాలను హరించే హక్కు ఈ కోర్టుకు లేదని వివరించారు.