అవినీతిపై సమర శంఖం:CPM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి పాలనను నిరసిస్తూ, అవినీతి వ్యతిరేక దినంలో భాగంగా వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సోమవారం వివిధ రూపాల్లో ఆందోళనలు, సదస్సులు జరిగాయి. విశాఖలో జరిగిన సభలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు మాట్లాడుతూ అవినీతి కుంభకోణాల్లో పీకల్లోతు కూరుకుపోయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పాలించే నైతిక హక్కు ఇంకెంతమాత్రమూ లేదని , పార్లమెంటులో ప్రతిపక్షాలు నిలేసే సమయంలో నిజాయితీగలవారైతే రాజీనామాలు చేయాలని, లేదంటే ప్రభుత్వమే వారిపై చర్య తీసుకోవాలని రాఘవులు డిమాండ్‌ చేశారు.