అబ్దుల్‌ కలామ్‌ను విస్మరించిన BJP

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ మనవడు ఎపిజె సయ్యద్‌ హజా ఇబ్రహీం బిజెపి నుంచి వైదొలిగారు. 2012లో పార్టీలో చేరిన ఆయన తమిళనాడు మైనారిటీ విభాగ ఉపాధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ సోమవా రం రాజీనామా చేశారు. ఢిల్లీలోని కలామ్‌ నివాస గృహాన్ని(రాజాజి మార్గ్‌ బంగ్లా) నాలెడ్జ్‌ కేంద్రంగా మారుస్తామని ఇచ్చిన మాటను కేంద్ర ప్రభుత్వం విస్మరించినందుకు నిరసనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.. ఎన్ని సార్లు ఈ విష యాన్ని గుర్తు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేద న్నారు.