అణచివేతలు చెల్లవు : సిపిఎం

చంద్రబాబు ప్రజలపై అణచివేత చర్యలకు, నిర్బంధానికి పాల్పడుతున్నారని, మరింత పెద్ద ప్రజాఉద్యమంతో వాటిని ఎదుర్కొంటామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తోందన్నారు. తుందుర్రు - కంసాలి బేతపూడి మధ్య ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్కు నిర్మాణాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. 30 నుంచి 40 గ్రామాల ప్రజలు ఆధారపడిన గొంతేరు కాలువను ఆక్వా ఫుడ్‌ పార్కు పూర్తిగా కలుషితం చేస్తుందన్నారు. స్థానికులు రెండేళ్లుగా ఉద్యమాలు చేస్తున్నా, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు.