అక్రమంగా నిల్వ ఉంచిన 102 ఉల్లి పట్టివేత..

 

హైదరాబాద్:విశాఖ నగరంలోని జ్ఞానాపురంలోని హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌లో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 102 టన్నుల ఉల్లిగడ్డలను విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. మహారాష్ట్రలో ఉల్లిని కొనుగోలు చేసి ఇక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు.