District News

 'గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ బిల్లు తో ప్రజలపై పెనుభారం పడుతుంది'. పన్నుల విధానంలో పెనుమార్పులు తీసుకువచ్చే జిఎస్‌టి బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున కసరత్తు చేస్తోంది.కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించినప్పటికీ స్థూలంగా అంగీకరించారంటూ ముందడుగు వేయడానికి కేంద్రం సిద్దమైందని అన్నారు..

విజయవాడ లో సమస్యల పరిష్కారానికి మున్సిపల్‌ కార్మికులు తమ సమ్మెను మరింత ఉధృతం చేశారు. 13 జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన కార్మికులు బందర్‌రోడ్డులోని సీఎం ఆఫీసు ముట్టడికి యత్నించారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. పలువురు మున్సిపల్‌ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కార్మికులు మాట్లాడుతూ ఈనెల 20 నుంచి సీఎం, మంత్రుల ఆఫీసు ఎదుట ధర్నాలు చేస్తామని, మంత్రులను జిల్లాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. డిమాండ్లు తీర్చేవరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏపీ మున్సిపల్‌ కార్మిక జేఏసీ స్పష్టం చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో మున్సిపల్ కార్మికుల ఆందోళనలతో అట్టుకుడుతోంది. ఏపీలో తమ సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడలో ఉన్న ఏపీ సీఎంక్యాంప్ ఆఫీసు ముట్టడికి బయలు దేరిన మున్సిపల్ కార్మికులను, కార్మిక నేతలను బందర్ రోడ్డులో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆ ప్రాంతం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్మికుల సమ్మెకు మద్ధతుగా సీఐటీయూ, సీపీఎం చేపట్టిన సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడికి పెద్ద ఎత్తున కార్మికులు బయలుదేరారు. అయితే రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న సీఐటీయూ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. పోలీసులకు, లెఫ్ట్‌ కార్యకర్తలకు జరిగిన తోపులాటలో పలువురికి...

తెలుగు రాష్ట్రాల్లో మున్సిపల్ కార్మికుల ఆందోళనలతో అట్టుకుడుతోంది. ఏపీలో తమ సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడలో ఉన్న ఏపీ సీఎంక్యాంప్ ఆఫీసు ముట్టడికి బయలు దేరిన మున్సిపల్ కార్మికులను, కార్మిక నేతలను బందర్ రోడ్డులో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆ ప్రాంతం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సిపిఎం ఆధ్వర్యాన తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు కోరంగి కంపెనీ భూముల్లో పోలెకుర్రు పంచాయతీకి చెందిన పేదలు గురువారం నుంచీ వ్యవసాయ సాగు ప్రారంభించారు. జూలై 13న కోరంగి కంపెనీ భూములను సిపిఎం ఆధ్వర్యంలో ఎర్రజెండాలు పాతి పేదలు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 200 మంది ప్రజలు ఈ భూముల్లో ప్రవేశించి గురువారం దుక్కిదున్నారు. సుమారు 25 ఎకరాల భూములను వీరు కష్టపడి సాగులోకి తెచ్చారు. 15 ఎకరాల భూముల్లో విత్తనాలు వెదజల్లారు. ఈ భూములను 30 ఏళ్లుగా భూస్వాములు అనుభవించారు.సుమారు 15 బస్తాల వరి విత్తనాలను నాటామని తెలిపారు. 

బేగంపేట ఎయిర్ పోర్టును ఆర్మీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో విమానయాన శాఖ మంత్రిగా ఉన్న అశోక గజపతిరాజు పావులు కదుపుతున్నారని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. బేగంపేట ఎయిర్‌ పోర్టు ప్రాంతంలో.. తెలంగాణ ప్రభుత్వం ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపడుతుంటే.. ఏపీ ప్రభుత్వం దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎయిర్ పోర్టును ఆర్మీకి అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

వారం రోజులుగా సమ్మె చేస్తున్నాప్రభుత్వం పట్టించుకోకపోవడం పై మున్సిపల్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలో భాగంగా ఇవాళ చలో విజయవాడకు పిలుపునిచ్చారు.

మున్సిపల్‌ కార్మికుల విషయంలో ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా నేడు విజయవాడలో సిఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తున్నట్లు మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికుల జెఎసి ప్రకటించింది. రాష్ట్రంలో ఏడురోజులుగా సమ్మె కొనసాగుతున్నా పర్మినెంటు ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల మధ్య చీలికతెచ్చి సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జెఎసి నాయకులు ఉమామహేశ్వరరావు, రంగనాయకులు, దశరధరామరాజు, వెంకటరత్ననాయుడు, వై.వి.రమణ, వి.రవికుమార్‌, ఎస్‌.శంకరరావు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సిలు ఇతర ప్రజాప్రతినిధులు వీధిరౌడీల్లా వ్యవహరిస్తూ కార్మికులను భయభ్రాంతులకు...

ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించిన తుఫాను సాయం పెంపుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ ఈ విషయాన్ని ప్రకటించారు. మొదట ప్రకటించిన రూ.1496.71 కోట్ల నుంచి రూ.2331.71కు పరిహారాన్ని పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ మొత్తంలో రూ. 1843.94 కోట్లను ప్రపంచ బ్యాంకు రుణం రూపంలో కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తుందని, మిగిలిన రూ.487.77 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

Pages