
ఢిల్లీలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. నైపుణ్యాల భారత్ స్థాపన లక్ష్యంగా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పని చేస్తుంది. ప్రపంచ యువనైపుణ్యాల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయిలో నైపుణ్యం గల కార్మిక శక్తి సృష్టి కేంద్ర కార్యక్రమ లక్ష్యం. నైపుణ్యాభివృద్ధి, సాంకేతికత, వృత్తివిద్య అందించేందుకే కౌశల్ వికాస్ యోజన. యువతను వేరువేరు రంగాల్లో నిపుణులుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందించింది.