హోదా కోసం రాజ్యసభలో పార్టీల డిమాండ్‌

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభలో అన్ని రాజకీయ పక్షాలు గురువారం ముక్త కంఠంతో డిమాండ్‌ చేశాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనిపై తన వైఖరిని వెల్లడించలేదు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడినప్పటికీి ప్రత్యేక హోదాకు సంబంధించిన ఊసే లేదు . ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం అమలు తీరుపై రాజ్యసభలో గురువారం మూడున్నర గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగింది.