
మాయావతిపై వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం రాజ్యసభలో బీఎస్పీ, కాంగ్రెస్, సీపీఐ(ఎం)తోపాటు ప్రతిపక్షాలు నిలదీయడంతో అధికార పార్టీ నష్ట నివారణా చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.దయాశంకర్ వ్యాఖ్యలకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోనూ బీఎస్పీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. చండీగఢ్లో బీజేపీ కార్యాలయం ముందు ఆందోళన సందర్భంగా స్థానిక బీఎస్పీ చీఫ్ జన్నత్ జహాన్ తీవ్ర హెచ్చరిక చేశారు. దయాశంకర్ నాలుక కోసినవారికి రూ.50 లక్షలు బహుమతి ఇస్తానని ఆమె ప్రకటించారు.