
కాశ్మీర్లో నెలకొన్న అశాంతిపై పీడీపీ-బీజేపీ కూటమి మౌనం సహించరానిదని సీపీఐ విమర్శించింది. రాష్ట్రంలో మామూలు పరిస్థితులు నెలకొల్పడానికి తక్షణం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ జాతీయ సమితి ఒక తీర్మానంలో డిమాండ్ చేసింది.కాశ్మీర్లో శాంతియుత పరిస్థితులు దెబ్బతినిపోవడానికి కారణం పీడీపీ-బీజేపీ కూటమేనని సీపీఐ ఆరోపించింది.పెల్లెట్ గన్స్ వాడకాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేసింది.