కాశ్మీర్‌ ఘటనపై అఖిలపక్షం వేయాలి:ఏచూరి

కాశ్మీర్‌ అంశంపై చర్చ జరపాలని నోటీసులు ఇచ్చిన ఏచూరి తొలుత మాట్లాడుతూ... కాశ్మీర్‌ ప్రజలకు ప్రస్తుతం డాక్టర్లు అత్యవసరం కానీ రక్షణ దళాలు కాదని అన్నారు. అధిక రక్షణ దళాలను ఉపయోగించడం వల్ల పరిస్థితిని ఏమైనా అదుపులోకి తీసుకొచ్చామా అని ప్రశ్నించారు. పాకిస్తాన్‌ ఏమైనా కుట్రలు పన్నితే.. దాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టండి. అంతే తప్ప ఈ పేరుతో అమాయక కాశ్మీరీలను భయబ్రాంతులకు గురిచేయవద్దని కోరారు. కాశ్మీర్‌ అంశంపై అఖిల పక్షం వేయాలని డిమాండు చేశారు.