రహస్య పత్రాల్ని బయటపెట్టిన కేంద్రం..

1945లో తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు అధికారికంగా ప్రకటించినా భారతీయులు అందరికి ఆయన మృతిపై ఆనుమానాలు మిగిలే ఉన్నాయి. తాజాగా కేంద్రం బయటపెట్టిన ఓ రహస్య పత్రంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. 1999లో నేతాజీ మృతిపై వాస్తవాలను వెలుగులోకి తేచ్చేందుకు అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం జస్టిస్‌ మనోజ్‌ ముఖర్జీ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది.  2వేల సంవత్సరంలో నరేంద్రనాథ్‌ సింద్‌కర్‌ అనే జర్నలిస్టు ఈ కమిషన్‌కు ఓ అఫిడవిట్‌ సమర్పించారు. 1968లో నేతాజీ బతికే ఉన్నట్లు తన అఫిడవిట్‌లో సింద్‌కర్‌ పేర్కొన్నారు.