ద్రవ్యోల్బణం 0.79% పెరిగింది...

కూరగాయల ధరలు ఒకేసారి రెండంకెల స్థాయిలో పెరగడంతో మే మాసంలో టోకు ధరల ద్రవ్యోల్బణం 0.79శాతం పెరిగింది. దీంతో సరఫరా విభాగంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించ డానికి విధానపరమైన చర్యలను పారిశ్రామిక రంగం చేపట్టాల్సి వస్తోంది. అటు టోకు, ఇటు రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరగడంతో పారిశ్రామిక ఉత్పత్తి మందగించినప్పటికీ భారత రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లలో కోత విధించడంలో జాప్యం చేయవచ్చునని భావిస్తున్నారు.