
గుల్బర్గ్ అల్లర్ల కేసులో దోషులకు శిక్ష విధించే అంశంపై జరుగుతున్న విచారణను ప్రత్యేక న్యాయస్థానం 17కు వాయిదా వేసింది. 2002లో గుజరాత్లోని గుల్బర్గ్లో జరిగిన మారణకాండకు సంబంధించి కోర్టు ఇటీవల 24 మందిని దోషులుగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. వీరికి శిక్ష ఖరారు అంశంపై విచారణ జరుపుతున్న కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనున్నది.