మథుర ఘర్షణపై సుప్రీం విచారణ

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో జరిగిన ఘర్షణపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని వేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై మంగళవారం విచారణ చేపట్టనుంది. ఈ ఘటనపై న్యాయవాది కామిని జైస్వాల్‌ వేసిన పిటిషన్‌పై పీసీ ఘోష్‌, అమితవ రాయ్‌లతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ రేపు విచారించనుంది.