
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్ని కల ఆరవ, తుదివిడత పోలింగ్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య గురువారం ముగిసింది. తూర్పు మిడ్నపూర్, కూచ్బెహర్ జిల్లాల్లోని 25 నియోజకవర్గాల్లో 6774 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ జరిగింది. పోలింగ్ బూత్లకు పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తుదివిడతలో రికార్డు స్థాయిలో 84.24 శాతం పోలింగ్ నమోదైంది.