
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదర దంటూ కేంద్రం వరుసగా ప్రకటనలు మీద ప్రకట నలు గుప్పిస్తోంది. కేంద్ర హోం సహాయ మంత్రి హె చ్పి చౌదరి, కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి జయంత్ సిన్హా ఇచ్చిన ప్రకటనలతో షాక్ తిన్న ఆంధ్రప్రదేశ్కు గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరో షాక్ ఇచ్చారు. ఏపికి ప్రత్యేక హోదా వుండదని నేరుగా చెప్పకపోయినా పునర్విభజన చట్టం ప్రకారం ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సినవి ఇప్పటికే ఇచ్చేశామన్నారు. ఇంకా ఇవ్వాల్సినవేమైనా వుంటే అవి కూడా పైసాతో సహా ఇచ్చేస్తామని అన్నారు.