పార్టీ మారితే TDP వాళ్ళు 20కోట్లు ఇస్తామన్నారు..

పార్టీ మారితే 20 కోట్లు ఇస్తామని టిడిపి తనను ప్రలోభాలకు గురిచేసిందని వైసిపి ఎమ్మెల్యే రాజకుమారి తెలిపారు. ఎప్పటికీ వైఎస్‌ జగన్‌ అడుగుజాడల్లోనే నడుస్తానని చెప్పారు. ప్రజలకు సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కొన్ని ఛానళ్లు అవాస్తవాలతో తనపై లేనిపోని కథనాలు ప్రసారం చేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 'నేనెవరితోనైనా టిడిపి వాళ్లతో మాట్లాడా'నని చెప్పానా? అని ప్రశ్నించారు.