ఉమర్, కన్నయ్య లను కాల్చిపారేస్తాం..

‘నెలాఖర్లోగా ఢిల్లీ నుంచి పారిపోండి... లేదంటే దుర్గాష్టమిలోగా కాల్చిపారేస్తాం’’ అంటూ కన్నయ్య కుమార్, ఉమర్ ఖలీద్‌లను ఓ రాజకీయ పార్టీ హెచ్చరించింది. భారత సైన్యంపై కన్నయ్య కుమార్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ హెచ్చరిక జారీ చేసింది. మీరట్‌ కేంద్రంగా పని చేస్తున్న ఉత్తర ప్రదేశ్ నవనిర్మాణ్ సేన జాతీయ అధ్యక్షుడు అమిత్ జానీ తన ఫేస్‌బుక్ పేజీలో ఈ హెచ్చరికలను పోస్ట్ చేశారు.