పీడీపీ, భాజపాల దోస్తీ కుదిరింది..!!

ప్రతిష్టంభనకు తెరదించుతూ.. జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తంచేస్తూ పీడీపీ, భాజపాలు శనివారం రాష్ట్ర గవర్నర్‌ ఎన్‌.ఎన్‌.వోహ్రాను కలవనున్నాయి. దీంతో మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. రాష్ట్రానికి ఆమె తొలి మహిళా ముఖ్యమంత్రి కానున్నారు.