జార్ఖండ్‌ సిఎంతో బృందాకారత్‌ భేటి..

సిపిఐ(ఎం) పొలిట ్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ మంగళవారం జార్ఖండ్‌ ముఖ్యమంత్రి రఘువర్‌ దాస్‌తో భేటీ అయ్యారు. లతేహర్‌ జిల్లాలో మార్చి 18నజరిగిన ఇద్దరి హత్యపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. కరత్‌ నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం రఘువర్‌ దాస్‌కు ఒక మెమోరాండంను సమర్పించింది. 32 ఏళ్ళ వయస్సు గల ఒక యువకుడు, 13 ఏళ్ళ వయస్సు గల బాలుడు హత్యోదంతంలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. హత్యకు గురైన వ్యక్తి భార్యకు, బాలుడి కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని కోరారు. బృందాకరత్‌ సోమవారం లతేహర్‌లో మృతుల కుటుంబాలను పరామర్శించారు.