బాబును జైలుకు పంపుతా:వైగో

తమిళనాట తాము అధికారంలోకి వస్తే... టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని జైలుకు పంపుతామని ఎండీఎంకే పార్టీ నేత వైగో సంచలన వ్యాఖ్య చేశారు. ఇటీవల తిరుపతి సమీపంలో జరిగిన తమిళ కూలీల ఎన్ కౌంటర్ ను ప్రస్తావించారు. ఎర్రచందనం కూలీల పేరిట 20 మంది అమాయక తమిళ కూలీలను చంద్రబాబు ప్రభుత్వం ఎన్ కౌంటర్ చేసిందని ఆయన ఆరోపించారు. ఎన్ కౌంటర్ పేరిట తమిళులను చంపేసిన ఏపీ సీఎం చంద్రబాబును... తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా జైలుకు పంపుతామని ఆయన సంచలన ప్రకటన చేశారు.