
భారత్, నేపాల్ సంబంధాలపై నేపాల్ ప్రధానితో ఏచూరి చర్చించారు. రెండు దేశాల మధ్య మైత్రీ బంధం మరింత బలపడాలని కోరినట్లు చెప్పారు. గతంలో నేపాల్ రాజ్యాంగ సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితుల నుంచి మళ్ళీ యథాతథస్థితికి చేరుకోవడానికి సిపిఎం జోక్యంతోనే జరిగిందన్న అంశం చర్చకు వచ్చినట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంలో నేపాల్కు రావాల్సిందిగా ఏచూరిని నేపాల్ ప్రధాని కోరారు.