
ముద్రగడతో చర్చలు మంచి వాతావరణంలో జరిగాయని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. గత నాలుగు రోజులుగా ఆమరణ దీక్షకు దిగిన ముద్రగడతో ప్రభుత్వ ప్రతినిధుల చర్చలు సఫలం కావడంతో ఆయన దీక్ష విరమించారు. ఈ సందర్భంగా కళా వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ ముద్రగడతో అన్ని విషయాలు మాట్లాడామన్నారు. వచ్చే బడ్జెట్లో కాపు కార్పొరేషన్కు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు.