
దళిత స్కాలర్ రోహిత్ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలకు మానవ వనరుల అభివృద్ధి శాఖ(హెచ్ఆర్డీ) ఇన్నాళ్లకు స్పందించింది. విశ్వవిద్యాలయాల్లో అణగారిన వర్గాలపై వివక్షకు అంతం పలకడానికి అన్ని వర్సిటీల ఉపకులపతిలతో ఫిబ్రవరి18న సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశంలోని 46 కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఉపకులపతిలను ఢిల్లీకు రప్పించ నుంది.