
భారత్లో కాలు మోపేందుకు వాల్మార్ట్ అడ్డదారులను ఆశ్రయించింది. భారత్లో తన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు వేలాదిమందికి కోట్లాది రూపాయల ముడుపులు చెల్లించిట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాల్స్ట్రీట్ జర్నల్లో వచ్చిన ప్రత్యేక కథనం వాల్మార్ట్ ముడుపుల బాగోతాన్ని బయటపెట్టింది. 2013 నుంచి కనీసం 2 వందల డాలర్ల చొప్పున అత్యధికులకు ముడుపులు ముట్టాయని పేర్కొంది.