
లక్నో: గోమాంస భక్షణకు వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన బిజెపి ఎమ్మెల్యే సంగీత్సింగ్సామ్కు మాంసం ఎగుమతుల సంస్థలో వాటా ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. మీరట్ జిల్లాలోని సర్ధానా నియోజకవర్గం నుంచి 2012లో బిజెపి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగీత్కు అల్-దువా ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో వాటా ఉన్నది వాస్తవమేనని స్పష్టమైంది ఈ కంపెనీ బర్రె-దున్నపోతు, మేక,గొర్రె మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తుంది. భారత్ నుంచి హలాల్ మాంసాన్ని అరబ్ దేశాలకు ఎగుమతి చేస్తున్న ప్రముఖ కంపెనీగా దీనికి పేరుంది.