
అగర్తలా : ఘర్వాపసీ, లవ్ జిహాద్, గో రక్ష వంటివి BJP మతోన్మాద ప్రణాళికలేనని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శించారు. హిందూ ఓటు బ్యాంకును కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోందని, ఆరెస్సెస్ రాజకీయ ఆయుధం బిజెపి అని ఆయన అన్నారు. మోడీ పాలనలో పౌరాణిక గాథలతో భారత చరిత్రను నింపే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ గజల్ గాయకుడు గులామ్ అలీ కార్యక్రమాన్ని శివసేన అడ్డుకోవటాన్ని ఏచూరీ తీవ్రంగా ఖండించారు.