రూ.4,417 కోట్ల నల్లధనం..

విదేశాలలో దాచిన నల్లధనం ఆస్తుల విలువ మరింతగా పెరిగింది. సెప్టెంబరు 30తో ముగిసిన '90 రోజుల నల్లధనం వెల్లడి పథకం'లో దాదాపు 638 మంది తమ నల్లధన ఆస్తుల విలువను వెల్లడించినట్లుగా రెవెన్యూ కార్యదర్శి హష్ముక్‌ ఆధియా సోమవారం తెలిపారు. వారు వెల్లడించిన మొత్తం అక్రమాస్తుల విలువ రూ.4,417 కోట్లకు చేరినట్లు ఆయన వివరించారు.