HCU పరిస్థితులపై రాష్ట్రపతితో ఏచూరి భేటీ

హెచ్ సీయూలో తాజా పరిస్థితులపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి... రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో భేటీ అయ్యారు. హెచ్ సీయూలో వేముల రోహిత్‌ ఆత్మహత్య, తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలను రాష్ట్రపతికి వివరించారు. గత నెల 17 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని విషయాలను ప్రణబ్‌ దృష్టికి తెచ్చారు. హెచ్‌సీయూ ఘటనలపై జోక్యం చేసుకోవాలని కోరారు. హెచ్చార్డీ మంత్రిత్వ శాఖ హిందూ రాష్ట్ర అభివృద్ధి మంత్రిత్వ శాఖగా మారకుండా చూడాలని సీతారాం ఏచూరి విన్నవించారు.