AP ఉమ్మడి ఆస్తుల విభజనకు కమిటీ

ఉమ్మడి ఏపీ ఆస్తుల విభజనకు కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశామని ఆ శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం అహిర్‌ వెల్లడించారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ అడిగిన ఓ ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిస్తూ.. కమిటీలో ఏపీ, తెలంగాణ రాషా్ట్రల నుంచి ఇద్దరికి చొప్పున ప్రాతినిధ్యం కల్పించామన్నారు.