ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబ్లింగ్ యాక్ట్ ప్రకారం.. ప్రభుత్వ భూమిని 33 సంవత్సరాలకు మాత్రమే లీజుకు ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ లీజు పరిమితి పెంచాలన్నా.. గరిష్ఠంగా 11 సంవత్సరాలు చొప్పున ఓ రెండుసార్లు మాత్రమే పొడిగించ వచ్చు. అంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ 55 సంవత్సరాలకు మించి... ఏ ప్రభుత్వ భూమినీ ఏ సంస్థకూ లీజుకు ఇవ్వడానికి వీలు లేదు. కానీ.. కార్పొరేట్ శక్తుల ప్రేమలో తలదాకా కూరుకు పోయిన చంద్రబాబు సర్కారు.. లీజు గడువును ఏకంగా 99 సంవత్సరాలకు పెంచేసింది.