437.35కోట్ల చందాలతో బీజేపీ..

దేశంలో వివిధ రాజ కీయ పార్టీలకు అందుతున్న చందాలలో 2014-15 ఆర్థిక సంవ త్సరంలో భారీ వృద్ధి నమోదైంది.వివిధ రాజకీయ పార్టీలు తమకు రూ. 20 వేలకు మించి అందిన విరాళాల వివరాలను ఎన్నికల కమి షన్‌కు సమర్పించిన జాబితాల ఆధా రంగా ఏడీఆర్‌ నివేదిక తయారైంది. అంటే ఇవి బహిరంగంగా ప్రకటించిన విరాళాల వివరాలు మాత్రమే. ప్రకటిం చనివి ఇంతకు పలు రెట్లు అధికంగా ఉంటాయనేది తెలిసిందే. ప్రకటించిన మేరకే చూసినా, రూ. 437.35 కోట్ల చందాలతో బీజేపీ అన్నింటికన్నా ముందున్నదని సంస్థ తెలిపిన వివరాల్లో ఉంది.