33.83 లక్షల కోట్లపై DRI దర్యాప్తు..

UPA ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2004-13 మధ్య దేశం నుంచి అక్రమంగా విదేశాలకు తరలిపోయిన 505 బిలియన్‌ డాలర్ల (ప్రస్తుత విలువలో సుమారు రూ.33.83 లక్షల కోట్లు) డబ్బుపై రెవెన్యూ నిఘా విభాగ డైరెక్టరేట్‌ (డీఆర్‌ఐ) దర్యాప్తు ప్రారంభించింది. నల్లధనంపై విచారిస్తున్న సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఇచ్చిన ఆదేశాలతో డీఆర్‌ఐ రంగంలో దిగింది.