
306 మంది భారతీయ విద్యార్థులు అమెరికా నుంచి బహిష్కరణ ముప్పును ఎదుర్కొంటున్నారు. వీసా కుంభకోణాన్ని బయట పెట్టేందుకు భద్రతా సంస్థలు చేపట్టిన నకిలీ విశ్వవిద్యాలయాల శూలశోధనలో భాగంగా సదరు విద్యార్థులు తమకు తెలియకుండానే అమెరికాకు చేరారు. అలాంటి విద్యార్థులను గుర్తించామనీ, దేశబహిష్కరణ ప్రక్రియ మొదలైందని అధికారులు వెల్లడించారు. న్యూజెర్సీ నార్తర్న్ విశ్వవిద్యాలయంలో గుర్తించిన భారత్కు చెందిన 306 మంది విద్యార్థులను గుర్తించామనీ, తిప్పి పంపే ప్రక్రియలో ఉంచినట్లు యూఎస్ఐసీఈ అంతర్గత భద్రత దర్యాపుల అధికార ప్రతినిధి అల్విన్ ఫిలిప్స్ పేర్కొన్నారు.