వరదబాధితులకు3లక్షల విరాళం:మధు

 వరద బాధితుల సహాయార్థం ప్రజల నుంచి విరాళాలు సేకరించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈనెల ఐదో తేదీన పార్టీ శాఖలన్నీ ప్రజల నుంచి విరాళాలు సేకరిం చాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పిలుపునిచ్చారు. తమిళనాడుతో పాటు రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతా లలో బాధితుల సహాయార్థం సిపిఎం రాష్ట్ర కమిటీ రూ.3 లక్షలు విరాళాన్ని పంపుతున్నట్లు గురువారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.