రాజ్యసభకు జీఎస్‌టీ బిల్లు !

జీఎస్‌టీ (వస్తువులు, సేవల పన్ను) బిల్లు చుట్టూ పరచుకున్న తెరలు తొలగబోతున్నాయి. ఈ బిల్లుకు సవరణలను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగీకారం తెలిపాయి. దీంతో ఈ బిల్లును శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెల 12తో ముగియనున్న ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లు ఆమోదం పొందుతుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది.