రాజధానిలో ప్రజా చైతన్యయాత్ర..

ప్రస్తుతం భూములు కోల్పోయి ఆందోళనలో ఉన్న రైతులకు భరోసాగా.. అండగా ఉండేందుకు సీపీఎం రాజధాని ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టింది. అమరావతి శంకుస్థాపనలోపే రాజధాని ప్రాంత రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిపిఎం రాష్ర్ట కార్యదర్మి పి.మధు డిమాండ్ చేసారు.ఈ యాత్ర ద్వారా 120 కిలోమీటర్లు 29 గ్రామాల్లో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. ప్రజల సంతోషాల మధ్య శంకుస్థాపనలు చేసుకోవాలని, సమస్యలు పరిష్కరించలేదని బాధలో ఉన్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామలు నెరవేర్చడం లేదని, గత పది నెలల నుండి పని, ఉపాధి లేదని పేర్కొన్నారు.