
రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలిద్దరూ ఆదివారం ఇక్కడ యనమలను ఆయన నివాసంలో కలిశారు. వారి భేటీలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం తెదేపా ఎమ్మెల్యే వర్మ కూడా పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలు, తెదేపాలోకి చేరికలు వంటి అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.