మోడీ రాజీనామాకు కేజ్రి పట్టు ..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ క్రికెట్ సంఘం ఛైర్మన్ గా ఉన్నప్పుడు జరిగిన అవకతవకల గురించి కేజ్రీవాల్ ప్రత్యేక అసెంబ్లీ సెషన్ లో వివరించారు. 2014 లోక్ సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మోడీ నెరవేర్చుకోవడం లేదని, జైట్లీని డీడీసీఏ అవినీతి ఆరోపణల నుండి రక్షించడానికి సీబీఐ దాడులు చేయించి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు కేజ్రీవాల్ ఆరోపించారు.