
విదేశీ పర్యటనలు ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం భారత్కు తిరుగు పయనం అయ్యారు. ఆయన అయిదు రోజుల్లో ఐదు దేశాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నెల 4వ తేదీన మోదీ విదేశీ పర్యటనకు వెళ్లారు. ముందుగా ఆఫ్గనిస్తాన్ పర్యటించారు. ఆ తర్వాత ఖతార్, స్విట్జర్లాండ్, అమెరికాతో పాటు చివరిగా మెక్సికోలో పర్యటించారు.