భారత రైల్వేలపై కొత్త పెట్టుబడులు

మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నందున, దేశంలో కొత్త పెట్టుబడుల ద్వారా వ్యాపారాన్ని భారీగా పెంచుకోవాలని కెనడాకు చెందిన అంతర్జాతీయ రవాణా రంగ సంస్థ బొంబాడియర్‌ నిర్ణయించింది. ఇప్పుడు భారత్‌లో 300 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2,000 కోట్లు) వ్యాపారం చేస్తున్నామని, అయిదేళ్లలో బిలియన్‌ డాలర్ల (రూ.6,600 కోట్లకు పైగా) వ్యాపారం సాధించాలనేది లక్ష్యమని బొంబాడియర్‌ అధ్యక్షుడు లారెంట్‌ ట్రోగర్‌ తెలిపారు.