
బొగ్గు కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న ప్రత్యేక కోర్టు నుంచి తొలి తీర్పు వెలువడింది. జేఐపీఎల్ (జార్ఖండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్), జేఐపీఎల్ డైరెక్టర్లు ఆర్ఎస్ రుంగ్టా , ఆర్సీ రుంగ్టా తప్పుడు డాక్యుమెంట్లతో జార్ఖండ్లో బొగ్గు క్షేత్రాలను పొందినట్లు సోమవారం తీర్పు చెప్పింది. ఈ ఇద్దరు డైరెక్టర్లను కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది.