బెజవాడలో మీ దందా నిజం కాదా..?

గతంలో సిబిఐ కేసు నుంచి తప్పించుకొనేందుకే రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్‌ వర్ల రామయ్య టిడిపిలో చేరారని ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షులు రాజీవ్‌ రతన్‌ విమర్శించారు. విజయవాడలో ఆయన సిఐగా పనిచేస్తూ పాల్పడిన దందా అందరికీ తెలుసని, అలాంటి వ్యక్తి తమ నేత సి రామచంద్రయ్యపై ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు.